జహీరాబాద్, నేటిదిశ: ఝరాసంగం మండలం లోని దేవరంపల్లి గ్రామానికి చెందిన జిల్లా బీజేవైఎం నాయకులు అశ్విన్ పటిల్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు,గతంలోను కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగంలో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన 2018 ఎన్నికల్లో బిజెపిలో చేరారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్యాయమైన పార్టీ కాంగ్రెస్ అని తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఏ చంద్రశేఖర్, జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా అశ్విన్ పాటిల్ మాట్లాడుతూ జహీరాబాద్ లో జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగిపూర్వా వైభవంవస్తుందని రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనిధీమా వ్యక్తం చేశారు, జహీరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు,ఈ కార్యక్రమంలోజహీరాబాద్ యూత్ కాంగ్రెస్ లీగల్ డిస్టిక్ చైర్మన్ నతనైల్, తాహిర్ పాటిల్, జుబేర్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.