పక్షులు,అటవీ జంతువుల కోసం నీటి తోట్లు ఏర్పాటు
నారాయణఖేడ్,నేటిదిశ:వేసవికాలంలో పక్షులు,అటవీ జంతువుల కోసం కొన్ని ఫారెస్ట్ బ్లాకులలో నీటి సాసర్ లను ఏర్పాటు చేసినట్లు నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.బుధవారం అయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాల మేరకు ఖేడ్ ప్రాంతంలోని 23 ఫారెస్ట్ బ్లాకులలో నీటి కొరత ఉన్నచోట సాసర్ పిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల అడవులలోని పక్షులు, అటవీ జంతువులకు త్రాగునీరు లేక ఇబ్బందులకు గురికావొద్దని వాటి దాహార్థి తీర్చడానికి సాసర్ కిట్స్ ఏర్పాటు చేయడo జరిగింది అన్నారు.వాటిలో నీరు ఖాళీ అయినా కొద్దీ తిరిగి నీటితో నింపుతామన్నారు.