వైభవంగా శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం
తిరుపతి,నేటి దిశ: ఆగస్టు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, […]
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అశ్విన్ పాటిల్
జహీరాబాద్, నేటిదిశ: ఝరాసంగం మండలం లోని దేవరంపల్లి గ్రామానికి చెందిన జిల్లా బీజేవైఎం నాయకులు అశ్విన్ పటిల్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు,గతంలోను కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగంలో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన 2018 ఎన్నికల్లో బిజెపిలో చేరారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్యాయమైన పార్టీ కాంగ్రెస్ అని తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఏ చంద్రశేఖర్, జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ […]